Wednesday, October 17, 2018

243 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌

🔲243 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌
17-10-2018 02:17:54

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న 243అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పీజీలో 75ు మార్కులు ఉండాలి. పీజీ పూర్తిచేసి కమిషనర్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులకు ప్రభుత్వం వెయిటేజీ ప్రకటించింది. అయితే, వెయిటేజీ 15శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. ప్రస్తుతం పీజీ పూర్తిచేసి సీనియర్‌ రెసిడెంట్‌గా ఏడాది నుంచి పనిచేస్తున్న వారికి కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది.

No comments: